దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరిని వదలటం లేదు. కరోనా మహమ్మారి అందరిపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులపైనా కూడా కరోనా పంజా విసురుతోంది. ఇక ఈ మహమ్మారి ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో దాదాపు 160 మంది జర్నలిస్టులను కరోనా అనుమానంతో క్వారంటైన్కు తరలించారు. ఈ క్రమంలో తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ గా తేలింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.