గుజరాత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఈ మహమ్మారి బారిన పడి 18 మంది మృతి చెందారు. దీంతో గుజరాత్ లో ఇప్పటివరకు ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 155 కు చేరింది. ఇక ఆదివారం ఒక్కరోజే 230 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,301కి చేరింది.