బయటకు రావొద్దంటే వస్తున్నారు.. పదండి క్వారంటైన్కి అని రూల్స్ని కఠనతరం చేశారు గుంటూరు పోలీసులు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నా ఏదో ఒక పేరుతో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. మరి మీరు ఇలా రోడ్లపైకి వస్తుంటే కరోనాని ఎలా నివారించగలుగుతాం అని అంటూ.. అనవసరంగా బయటకు వచ్చే వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు పోలీసులు. గుంటూరు, నర్సరావు పేటలో పాజిటివ్ కేసుల సంఖ్య 214కి చేరడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.