లాక్‌డౌన్.. మే 25 వరకు!!

Update: 2020-04-28 16:04 GMT

కరోనా వైరస్ అందర్నీ కట్టడి చేసి ఇంట్లో బంధించింది. మార్చి 24 నుంచి మొదలైన లాక్‌డౌన్ ఏప్రిల్ 24తో ముగిసి నెలరోజులు గడిచిపోయింది. మరో నెల అంటే మే 24 వరకు తప్పదని లాక్‌డౌన్‌ని పొడిగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, శాస్త్రీ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయాల్లో హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు కల్వకుంట్ల సంజయ్ సహకారంతో 500 మంది పారిశుధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Similar News