యూపీలో ఇద్దరు సాధువుల హత్య.. సీఎం యోగి సీరియస్

Update: 2020-04-28 14:07 GMT

యూపీలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జరిగింది. జిల్లాలోని శివాలయానికి చెందిన ఇద్దరు సాధువులు మంగళవారం ఉదయం హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతులను పగౌనా గ్రామానికి చెందిన జగదీష్ (55), షెర్సింగ్ (45) గా గుర్తించినట్లు వారు తెలిపారు. ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని సమగ్ర నివేదికను సమర్పించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు.

Similar News