ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ఏపీలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కు చేరింది. అటు, గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. కరోనా మృతుల సంఖ్య 36కు చేరింది. ఇప్పటివరకు 729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా.. 1012 మంది చికిత్స పొందుతున్నారు.