దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో ఈ కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. తాజగా 30 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని కంటైన్మెంట్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించిన వీరికి విధులు ముగిసిన అనంతరం జోద్పూర్ తరలించారు. జోద్పూర్ క్యాంప్లో చేరే ముందు వారికి పరీక్షలు నిర్వహించగా వారందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జవాన్లందరినీ ఐసోలేషన్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.