దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిక్రీ బోర్డర్ ఏరియాలోని ఓ గోడౌన్ లో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో మంటలను అదపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గోడౌన్ చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయాయి.