విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సినీ నటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతి

Update: 2020-05-07 23:45 GMT

విశాఖపట్నం సమీపంలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ అయి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై సినీ నటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయ విదారక సంఘటన అని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News