లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో హైదరాబాద్లో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ కూలీల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఒకవైపు కన్స్ట్రక్షన్ పనులకు మినహాయింపును ఇచ్చింది. మరోవైపు వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో కూలీలు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. ఫలితంగా కూలీలులేక భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి.