చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Update: 2020-05-09 19:16 GMT

చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర కార్‌ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు నుంచి తెలంగాణలలో కాంట్రాక్టు పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా పెరియకోయిల్‌కు చెందిన వేలు, మణిబాలన్‌, వేణుగోపాల్‌గా గుర్తించారు. మరో వ్యక్తి మణికంఠ గాయాలతో బయటపడ్డాడు.

Similar News