వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు చేపట్టినప్పటికీ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అయిదుగురు ఎయిర్ ఇండియా పైలెట్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు విమానయాన వర్గాలు ఆదివారం తెలిపాయి. దీంతో వారిని హోం క్వారంటైన్లో ఉంచారు. కాగా, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు సిబ్బందికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.