ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ప్రజలు ఉండడానికి అనువుగా ఉందో లేదో కమిటీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు మంత్రి అవంతి శ్రీనివాస్. పరిశ్రమలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. కంపెనీకి అనుమతులు ఉన్నాయా లేదా అన్నదానిపై విచారణ జరుగుతుందన్నారు అవంతి. మరోవైపు జన జీవనానికి ఇబ్బందులు కలగకుండా కమిటీలు సలహాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు కంపెనీ జీఎం మోహన్రావు. ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.