ఏపీలో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 33 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కి చేరింది. ఇప్పటి వరకు 1056 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 949గా అధికారులు ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు కరోనా సోకి 46 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 10 కేసులు నిర్ధారణ అయ్యాయి.