బుధవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి మహానాడు జూమ్ యాప్లో నిర్వహించనున్నారు. ఐతే.. మూడ్రోజుల పాటు జరగనున్న మహానాడులో.. జూమ్ యాప్లో ఎంత మంది పాల్గొనాలో నేడు నిర్ణయించనున్నారు. మహానాడు నిర్వహణతో పాటు విశాఖ ఘటన..విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలు తదితర అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు.