కరోనా అన్ని వర్గాల వారిపై విరుకుచుపడుతోంది. డిఫెన్స్లో కూడా పలువురికి సోకుతోంది. తాజాగా ఈ మహమ్మారి దాటికి ఒక సీఐఎస్ఎఫ్ అధికారి మరణించారు. కరోనా సోకిన ఓ ఏఎస్ఐ కోల్కతాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకూ సీఐఎస్ఎఫ్ లో 68 మందికి కరోనా సోకగా.. ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో 27 మంది ఢిల్లీలో, 32 మంది ముంబైలో, ఐదుగురు అహ్మదాబాద్ నుంచి నమోదయ్యాయి. అటు.. కోల్కతా, గ్రేటర్ నోయిడా నుంచి ఇద్దరు చొప్పున కేసులు నమోదయ్యాయి.