బాధితులను అరెస్ట్ చేయడం ఏంటీ?: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Update: 2020-05-14 21:15 GMT

12మంది మృతికి కారణమైన కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో పర్యటించిన మాధవ్.. గ్రామస్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎల్జీ రసాయన పరిశ్రమను తొలగించి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విభాగం కంపెనీలను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమ యజమాన్య ప్రతినిధులను అరెస్టు చేయాల్సిన పోలీసులు.. బాధితులను అరెస్టు చేయడం ఏమిటని మాధవ్ ప్రశ్నించారు.

Similar News