అమరావతి రాజధాని కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుల ముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు.. ఇలా ప్రభుత్వం పెట్టిన అన్ని రకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు పోరాటం చేస్తున్నారన్నారు. రాజధాని తరలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆవేదనతో 64 మంది రైతులు గుండెపోటుతో మరణించారని ఆయన చెప్పారు. రైతులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.