టెక్నాలజీని స్టూడెంట్స్, టీచర్స్ మధ్య వారిధిగా మారుస్తాం: నిర్మలాసీతారామన్
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలోని భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విద్యావిధానంలో కీలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. విద్యావ్యవస్థలో టెక్నాలజీతో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీతో ఆన్ లైన్ క్లాసులు చెప్పేందుకు మూడు కొత్త చానెళ్లు రూపొందించామని.. మరో 18 చానెళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆమె అన్నారు. స్కైప్తో పాటు టాటాస్కై, ఎయిర్టెల్ లాంటి చానెళ్ల ద్వారా విద్యార్థలకు ఇళ్లలోనే క్లాసులు అందిస్తామని అన్నారు. స్కూళ్లలో డిజిటలైజేషన్కు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. స్వయం ప్రభ డీటీహెచ్ సేవల ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు 4గంటల పాటు ఆన్లైన్ క్లాసులు ఉంటాయన్నారు. ఈ-స్కూల్లో 200 కొత్త పుస్తకాలు, కొత్తగా 12 ఈ-విద్య ఆన్లైన్ ఛానెల్స్ అదుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. ఆన్లైన్ కోర్సుల అమలుకు 100 వర్సిటీలకు అనుమతి ఇస్తున్నట్టు ఆమె తెలిపారు. దీనిపై విద్యార్థులకు, ఉపాద్యాయలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు.