సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం తెలంగాణలో బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. 50 శాతం ప్రయాణికులతో బస్సులను నడిపేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. సిబ్బందికి శానిటైజర్, మాస్కులు తప్పనిసరని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే అంతర్ రాష్ట్ర సర్వీసుల విషయంలో కేబినెట్లో చర్చించనున్నారు.