మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. షోలాపూర్ నుంచి జార్ఖండ్కు వలసకూలీలను తీసుకెళ్తున్న బస్సు.. ప్రమాదానికి గురైంది. యవాత్మల్ వద్ద.. ఓ టిప్పర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదంటున్నారు పోలీసులు. ఈ బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు.