కర్నాటకలో వలస కార్మికులు.. తమను స్వస్థలాలకు పంపించాలని ధర్నా చేపట్టారు. మంగళూరులో దాదాపు 400 మంది వలస కార్మకులు రోడ్డెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. వలస కార్మికుల డిమాండ్లు తీరుస్తామని.. అన్ని విధాల వారిని ఆదుకొంటామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వలస కార్మికల సమస్యలు పూర్తిగా పరిస్కారం కావటంలేదు. ఇంకా చాలా మంది వలస కార్మికులు స్వరాష్ట్రాలకు చేరుకోలేదు. చాలా మంది ఇంకా కాలినడకన వారి ప్రయాణం కొనగిస్తున్నారు.