లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలపాటు హైదరాబాద్లోనే ఉండిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా అమరావతి వెళ్లారు. దారి పొడవునా టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. చంద్రబాబు రాకతో ఉండవల్లి నివాసానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. బాబు మళ్లీ మీరే రావాలంటూ ప్లకార్డులతో కార్యకర్తలు సందడి చేశారు.
లాక్డౌన్ వల్ల మార్చి 22 నుంచి చంద్రబాబు హైదరాబాద్లోనే ఉండిపోయారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆయన ఏపీకి వచ్చారు. అటు.. చంద్రబాబు సోమవారం విశాఖ పర్యటన వాయిదా పడింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించేందుకు సోమవారం ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే ఏపీలో విమానాల ప్రారంభం ఆలస్యం కావడంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మహానాడు సందేశమివ్వనున్నారు.