శ్రీకాకుళం జిల్లాలో వలస కూలీల బస్సు బోల్తా

Update: 2020-05-26 15:48 GMT

శ్రీకాకుళం జిల్లాలో వలసకార్మికులతో వెళుతోన్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన వలసకూలీలు బెంగళూరు నుంచి కోల్‌కతాకు బస్సులో వెళుతున్నారు.. అయితే బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మండస మండలంలోని బలిగం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై 33 మంది వలస కార్మికులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులను పలాసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక మలుపు వద్ద బస్సు డ్రైవర్ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రైవేట్ బస్సులో మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నారు.

వారందరికీ శ్రీకాకుళం పోలీసులు కార్మికులకు వైద్య సహాయం, ఆహారం అందించారు.

Similar News