ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనామహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 68 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2787కి చేరింది. అలాగే నిన్న 10 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1913 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 816 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా తూర్పు గోదావరిలో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9664 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 58 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 68 కేసులలో నెల్లూరులో 8 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 9 మంది వచ్చారు.