ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో వివిధ దేశాల్లో కలిపి 5,581 మరణాలు సంభవించాయని.. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 349,095 కు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అలాగే ధృవీకరించబడిన కేసుల సంఖ్య కొత్తగా 84,314 పెరిగి.. మొత్తం 5,488,825 గా నమోదయిందని డబ్ల్యూహెచ్ఓ తన రోజువారీ నివేదికలో తెలిపింది. కరోనా మహమ్మారి సంక్రమణ కేసులు అధికంగా అమెరికా ఖండంలో (ఉత్తర ,దక్షిణ అమెరికా) లో ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇక్కడ మొత్తం కేసులు 2,495,924 ఉండగా..145,810 మరణాలు నమోదయినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే ఐరోపాలో ఖండంలో కూడా 2,061,828 కేసులు, 1,76,226 మరణాలు నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా 1,63,4010 ఇన్ఫెక్షన్లు అమెరికాలో ఉన్నాయి.