నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట గ్రామంలో చిరుత పులి కలకలం రేపింది. గ్రామశివారులో రైతులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది. దీంతో ఉచ్చులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. వలలో చిక్కుకున్న చిరుతను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఉచ్చులో నుంచి బయటకు వచ్చిన చిరుత.. ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించింది.