యునైటెడ్ కింగ్డమ్లో పనిచేస్తున్న భారతీయ సంతతి వైద్యుడు రాజేష్ గుప్తా హోటల్లో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కరోనా సేవలకు అంకితమైన రోగులకు చికిత్స అందిస్తున్నారు. జాతీయ ఆరోగ్య సేవ.. మహమ్మారితో ముడిపడి ఉండటంతో చాలా మంది వైద్య సిబ్బంది ఆసుపత్రులలో పనిచేస్తూ ఇళ్లకు దూరంగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో రాజేష్ గుప్తా కూడా కుటుంబసభ్యులకు సైతం దూరంగా ఉంటూ ఒక హోటల్లో నివాసముంటున్నారు. కాగా ఆయన మృతి వెనుక గల కారణాలు తెలియలేదని అతనితో పాటు పనిచేసే వైద్యులు చెప్పారు.
రాజేష్ గుప్తా 1997 లో జమ్మూ విశ్వవిద్యాలయం నుండి వైద్య శాస్త్రంలో పట్టా పొందారు, 2006 లో యుకెకు వెళ్లారు.. అక్కడ పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ అనస్థీటిస్ట్ గా పనిచేస్తున్నారు. లండన్లోని ఫ్రిమ్లీ హెల్త్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు రాజేష్ గుప్తా మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కాగా గురువారం సాయంత్రం నాటికి, UK లో 37,837 మరణాలు మరియు 269,127 కేసులు ఉన్నాయి.