బెజవాడలో కత్తులతో వీరంగం సృష్టించిన విద్యార్ధులు

Update: 2020-05-31 13:57 GMT

బెజవాడలో కత్తులతో వీరంగం సృష్టించారు విద్యార్ధులు. పటమటలో రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి విద్యార్ధి గ్రూపులు. ఈ కత్తిపోట్ల దాడుల్లో గాయపడిన వారిని సమీపంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తునారు. విద్యార్ధులు కత్తులతో వీరంగం సృష్టించడంతో.. బెజవాడ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు.. ఈ గొడవల్లో రాజకీయపార్టీల అనుచరులు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుట్టుగా విచారణ చేస్తున్నారు.

Similar News