ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై కాంగ్రెస్ నేతలు... గవర్నర్ తమిళి సైని కలిసి ఫిర్యాదు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు... వీహెచ్, జగ్గారెడ్డి తదితరులు... గవర్నర్ తో భేటీ అయి... ఓయూ భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.