కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే మరో మార్గం లేదు.. శుభ్రత పాటించాలి. కేసుల సంఖ్య కాస్త తగ్గు ముఖం పట్టినా మళ్లీ వైరస్ మన దరికి చేరకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. కొంత మంది ఏ జాగ్రత్తలు పాటించకుండా రోడ్ల మీద తిరిగేస్తున్నారు. అలాంటి వారు కేరళకు చెందిన ఈ ఆటో డ్రైవర్ని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఆటోలోనే సబ్బునీళ్ల బాటిల్ను ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కే వారంతా సబ్బు నీటితో ముందు శుభ్రం చేసుకున్నాకే ఆటో ఎక్కేలా చూస్తున్నాడు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియోను పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. పలువురికి ఈ ఆటో డ్రైవర్ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జాగ్రత్తలు తీసుకోపోతే కరోనా కాచుక్కూర్చుంటుంది అటాక్ చేయడానికి. వీలైనంత వరకు ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నిద్దామని.. కరోనాని తరిమికొడదామని ఆటో ఎక్కే కస్టమర్లకు చెబుతుంటాడు.
Auto rickshaw with hand washing and sanitizer facilities #CoronaInnovation @NammaBengaluroo pic.twitter.com/30KBjAGxxG
— Harsh Goenka (@hvgoenka) June 2, 2020