ప్రపంచయుద్దం సమయంలో కూడా అన్ని రంగాలు పనిచేశాయని.. ఇప్పటిలా ఆసమయంలో లాక్ డౌన్ లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అయితే, కరోనా వలన కేంద్రం లాక్ డౌన్ విధించిందని అన్నారు. ప్రపంచం మొత్తం ఇలా లాక్డౌన్లో ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఇదో ప్రత్యేకమైన సందర్భమని అన్నారు. కానీ, కేంద్రం లాక్డౌన్ అమలు చేయడంలో విఫలమైందని విమర్శించార. కానీ, లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత మరిన్ని కేసులు పెరిగాయని మండిపడ్డారు. లాక్డౌన్, ఆర్థిక పరిస్థితులపై బజాజ్ గ్రూప్స్ ఎండీ, పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్తో గురువారం ఎంపీ రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.