ఏపీలో నెలకొన్న ఇసుక కొరతపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తోపుడు బండిపై మార్కెట్లో ఇసుకను విక్రయిస్తూ నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దారుకు ఇసుకు కొరతపై వినతిపత్రం సమర్ఫించారు. రాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మితే జగన్ పాలనలో ఇసుకను రత్నాలుగా అమ్మతుతున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో పనులు లేక పస్తులుంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.