ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వ బదిలీ చేసింది. ఏకంగా 30 మంది అధికారులును బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వీబీ రమణ మూర్తిని సీజీఎం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా, 1987 బ్యాచ్కు చెందిన డి నళినీ మోహన్కి ఎన్వరాన్మెంట్, ఫారెస్ట్ విభాగానికి,
వెయిటింగ్లో ఉన్న సంజయ్ గుప్తాకు వర్కింగ్ ప్లాన్ విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్స్గా పోస్టింగ్ ఇచ్చింది. వీరితోపాటు పలువురు అధికారులు రాజేంద్ర ప్రసాద్ ఖజూరియా, వినోద్ కుమార్ సింగ్, రమేశ్ కుమార్ సుమన్, ఆనంద్ కుమార్ జా, ఎం రేవతి, కే. గోపీనాథ్, రాహుల్ పాండే, శాంతి ప్రియా పాండే, పీ.రామ్మోహన్ రావు, ఎం. శివప్రసాద్, యశోధ బాయ్, టీ జ్యోతి, రామకృష్ణ, సెల్వం, నందని సలారియా, సునీల్ కుమార్ రెడ్డి, వైవీకే షణ్ముఖ్ కుమార్, అనంత్ శంకర్, రవీంద్ర ధర్మా, సచిన్ గుప్తా, శ్రీనివాసరెడ్డి తదితరులను బదిలీ చేసింది.