జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మేయర్ పేషీలో ఓ అటెండర్కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేయర్ ఛాంబర్ మూసివేసి శానిటైజ్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. బల్దియా కార్యాలయంలో ఇప్పటి వరకు మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో పాజిటివ్ వచ్చిన సెక్షన్ సిబ్బందికి ఈరోజు సరోజినీ దేవి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.