హైకోర్టు దయతోనే తాను బయటకు వచ్చానని.. లేదంటే పిచ్చోడిని చేసేవారని అన్నారు డాక్టర్ సుధాకర్. ఆస్పత్రిలో వైద్యులు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. తానే మానసిక ఆస్పత్రిలో చేరానని సూపరింటెండెంట్ చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. డాక్టర్గా 20 ఏళ్లు పని చేసిన తనకు ఎంతో మంచి పేరు ఉందని.. కానీ నర్సీపట్నంలో కొంతమంది కక్ష కట్టారని ఆరోపించారు. కారుతోపాటు కొన్ని వస్తువులు తీసుకునేందుకు ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చారు.