నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడడం కలకలం రేపింది. కొండమల్లేపల్లి సాగర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర.. బాబూజీనగర్కు చెందిన యాదగిరి అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా.. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.