ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై కూడా సీఎం స్పందించాలి: కన్నా

Update: 2020-06-12 19:24 GMT

గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందన్నది వాస్తవమని.. అయితే ఎవరూ అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వమే కాదు.. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపైనా జగన్ స్పందించాలన్నారు. వైసీపీ నేతలే ఇసుక మాఫియా తయారైందని చెబుతున్నారని అన్నారు. ఈ సంవత్సర కాలంలోఇసుక దోపిడీకి పాల్పడిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కన్నా

Similar News