చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. ఎమ్మెల్యే నవాజ్ బాషా నోరు జారారు. జాతీయగీతం జనగణమనని జిడ్డు కృష్ణమూర్తి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారని అన్నారు. చేసిన తప్పును గ్రహించకుండానే ఎమ్మెల్యే నవాజ్ బాషా తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఎమ్మెల్యే పొరపాటును అధికారులు, వైసీపీ నాయకులు కూడా గుర్తించకపోవడం గమనార్హం. మదనపల్లె బెసెంట్ థియొసోఫికల్ కాలేజ్లో 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయగీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు.