సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం

Update: 2020-06-16 08:22 GMT

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి మరోసారి లాక్‌డౌన్‌ విధించింది. చెన్నై సహా 4 నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. చెన్నై, కాంచీపురం చెంగల్పట్టు, తిరువళ్లూరుల్లో జూన్ 19 నుంచి జూన్ 30వరకు కంప్లీట్ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. గత పది రోజులుగా చెన్నై, కాంచీపురం చెంగల్పట్టు, తిరువళ్లూరుల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్క చెన్నైలోనే 30 వేల కేసులున్నాయి. కరోనా మరణాలు కూడా మద్రాస్ నగరంలో ఎక్కువగా ఉన్నాయి.

Similar News