రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడమే తాము చేసిన పాపమా అని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతే రాజధాని అని ప్రతిపక్షంలో ఉండగా అంగీకరించిన జగన్ ఇప్పుడు సీఎం అయ్యాక రాజధాని మారుస్తానని చెప్పడం అన్యాయమంటున్నారు. రాజధానికి భూములు ఇచ్చి తమకు చావాలో బతకాలో అర్థం కావడం లేదంటున్నారు.. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించడం అంటే అమరావతిని చంపినట్లేనని వారు వాపోతున్నారు.