ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆల్ పార్టీని పిలిచారు. ఈనెల 19న అఖిలపక్షాన్ని ఆహ్వానించిన ప్రధాని.. భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించనున్నారు. చైనా సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో పరిస్థితుల్ని వివరించి.. సలహాలు కోరనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపక్ష నేతలతో చర్చలు జరపనున్నారు.