ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపొద్దు: గల్లా జయదేవ్

Update: 2020-06-18 17:51 GMT

రాజధాని గ్రామాల్లో గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి అమరావతి గ్రామాల్లో రైతులను కలిసి మాట్లాడారు. ఒకే రాజధాని-ఒకే రాష్ట్రం అంటూ అమరావతి JAC చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగించాల్సిందేనని గల్లా జయదేవ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News