కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. జాతి ప్రయోజనాలను సైతం దెబ్బతీసేలా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది ప్రత్యర్థులకు ప్రయోజనం కలిగించేలా ఉందని రామ్ మాధవ్ మండిపడ్డారు. మన్మోహన్ జమానాలోను చైనా దుర్నీతిని చూశామని.. ఆనాడు ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయలేదనే విషయాన్ని రామ్ మాధవ్ గుర్తుచేశారు.