నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ వేసింది. పిటిషన్లో ప్రతివాదిగా నిమ్మగడ్డ పేరును చేర్చారు. ఈ పిటిషన్పై మరికాసేపట్లో సుప్రీం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనుంది. దీంతో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.