పెనుగంచిప్రోలులో భారీగా అక్రమ మద్యం పట్టివేత

Update: 2020-06-19 10:01 GMT

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో భారీగా మద్యం పట్టుబడింది. నీళ్ల డబ్బాల్లో తరలిస్తున్న 2500 మద్యం బాటిళ్లను పెనుగంచిప్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం రావాణ కేసులో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఉన్నప్పటికీ జిల్లాలోకి అక్రమంగా మద్యం చేరుతోంది. సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉన్నా.. ఆ వాహనం జిల్లాలోకి ఎలా వచ్చింది అన్నదారిపై పోలీసులు అరా తీస్తున్నారు.

Similar News