హైదరాబాద్‌లో కరోన విజృంభణ.. ఒక్క రోజులో 302 కేసులు

Update: 2020-06-19 00:02 GMT

తెలంగాణలో కరోన మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 352 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,027 కి చేరింది. అటు, ఈరోజు ముగ్గురు చనిపోగా.. మరణాల సంఖ్య 195కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలోనే 302 కేసులని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకూ 3301 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 2,531 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News