ఆంధ్రప్రదేశ్లో పదో తగరతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమమూలపు సురేశ్ ప్రకటించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడటం కరెక్ట్ కాదని, పరీక్షలను రద్దు చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. టెన్త్ ఎగ్జామ్స్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే టెన్త్ పరీక్షలను రద్దు చేశారు.