బాలయ్య సినిమా 'సింహ' డైలాగ్‌ను గుర్తు చేసిన లోకేష్‌

Update: 2020-06-23 15:04 GMT

టీడీపీ సానుభూతిపరులు నందకిషోర్, కృష్ణ అరెస్ట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ పరిపాలనా తీరుపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య సినిమా సింహ డైలాగ్‌ను ఈ ట్వీట్‌లో ప్రస్తావించారు. వైసీపీ మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 108లో స్కామ్ బయటపడితే నో సిఐడి, మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి అంటూ బాలయ్య డైలాగ్‌ను గుర్తు చేశారు లోకేష్‌.

రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌ని సీఎం జగన్‌.. సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్‌గా మార్చేశారంటూ ఫైర్‌ అయ్యారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?. ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ, కిషోర్‌కు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ''సీఎం జగన్ చెత్త పాలన గురించి వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు. మరి వారిని సిఐడి అరెస్ట్ చేస్తుందా?’’ అంటూ ప్రశ్నించారు లోకేష్‌.

Similar News