నిమ్మగడ్డ రమేష్ కుమార్తో బీజేపీ నేతలు సుజన, కామినేని భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నించారు టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య. వారేమైనా అసాంఘిక శక్తులా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. రమేష్ కుమార్ను తిరిగి నియమించేందుకు జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకే వాళ్లు సమావేశమ్యారన్నారు వర్ల రామయ్య... సీఎం జగన్, విజయసాయిరెడ్డిలా వీళ్లు తప్పులు చేయలేదన్నారు. ఏ కేసుల్లోనూ వీరు ముద్దాయిలు కాదన్నారు.